బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో అద్దంకి ఎస్ఐ సమందర వలి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, డ్రైవర్ సహా అయిదుగురు మృతి చెందారు. ఎస్ఐ కుటుంబ సభ్యులు కారులో చినగంజాం మండలం సోపిరాలలో మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకునేందుకు వెళ్లారు. రాత్రి 11:30 వరకూ శివరాత్రి సందర్భంగా జరిగే సంబరాల్లో ఆనందంగా పాల్పంచుకున్నారు. తమ స్వస్థలం గుంటూరు వెళ్లేందుకు కారులో తిరిగి ప్రయాణమయ్యారు.
మేదరమెట్ల నుండి గుంటూరు వెళ్ళేందుకు రోడ్డు ఎక్కే సమయంలో కారును లారీని ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఉన్న వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ కొండముడి వీర బ్రహ్మాచారి (22), అద్దంకి ఎస్ఐ భార్య షేక్ వహీదా వలి (38), కుమార్తె షేక్ అయేషా హుమేరవలి (9), బంధువులు గురజాల జయశ్రీ (50), గురజాల దివ్య తేజ (29) అక్కడికక్కడే మృతి చెందారు. సిఐ రోశయ్య, ఎస్ఐ శివకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పాదయాత్ర అనుమతులు రద్దు చేసి వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు .. మహబూబాబాద్ లో ఉద్రిక్తత