NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం .. అయిదుగురు ఏపీ వాసులు మృతి

Advertisements
Share

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపికి చెందిన అయిదుగురు దుర్మరణం పాలు కాగా, మరో 13 మంది గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా వెలగొడు మండలానికి చెందిన పలువురు జీపులో కర్ణాటక రాష్ట్రం కలబురిగిలో దర్గా ఉరుసు జాతరకు వెళుతుండగా యాదగిరి జిల్లాలో ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టింది.

Advertisements
Road Accident

 

ఈ ప్రమాదంలో మునీరు (40), నయామత్ (40), రమీజా బేగం (50), ముద్దత్ షీర్ (12), సమ్మి (13) మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల జరిగిందా లేక అతి వేగమే ప్రమాదానికి కారణమా అనే విషయం పోలీసు దర్యాప్తులో తేలనున్నది.

Advertisements

మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?


Share
Advertisements

Related posts

Mineral Water: ప్రతిరోజు 3 నుంచి 5 లీటర్ల మినరల్ వాటర్ తాగితే ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్..!!

bharani jella

Sankalp reddy : ఘాజీ దర్శకుడుకి బాలీవుడ్‌లో ఛాన్స్..?

GRK

హోమ్ మంత్రి సుచరిత ముందే వైసీపీ నేతల వాగ్వాదం

Siva Prasad