Breaking: కృష్ణానదిలో ఈతకు దిగి అయిదుగురు విద్యార్ధులు గల్లంతు అయ్యారు. ఈ ఘటన విజయవాడ యనమదలకుదురు సమీపంలో శుక్రవారం జరిగింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఏడుగురు విద్యార్ధులు యనమదలకుదురు సమీపంలో కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. ఈ విద్యార్ధులు దిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటంతో విద్యార్ధులు గల్లంతు అయ్యారు.
వీరిలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నలుగురు గల్లంతు అయ్యారు. వీరి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందడంతో పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని గత ఈతగాళ్లతో గాలింపు చేయిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో విద్యార్దుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.