Gannavaram Airport: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వివిధ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రోజు (మంగళవారం) నుండి ఒమన్ దేశ రాజధాని మస్కట్ కు ఎయిర్ ఇండియా సంస్థ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి విమాన సర్వీసు ప్రారంభిస్తోంది. వారానికి ఒక సర్వీస్ మాత్రమే నడుపనుంది. ఈ విమాన సర్వీస్ ద్వారా గన్నవరం నుండి మస్కట్ కు కేవలం మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. 182 మంది ప్రయాణీకుల సామర్థ్యం కలిగిన ఎయిర్ బస్ ఏ – 321 విమానం ప్రతి మంగళవారం హైదరాబాద్ నుండి ఉదయం 11గటలకు గన్నవరం చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు నేరుగా మస్కట్ కు బయలుదేరి వెళుతుంది. మస్కట్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2గంటలకు అక్కడకు చేరుకుంటుందని ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధులు తెలిపారు.
గన్నవరం విమానాశ్రయంలో కొత్త రన్ వే నిర్మించిన నేపథ్యంలో ఈ ఏడాది జూలై 16 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించారు. గతంలో 2286 మీటర్ల మేర రన్ వే ఉండగా, దాన్ని మరో 1074 మీటర్ల మేర పెంచారు. దాంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలకు అనువుగా మారింది. బోయింగ్ వంటి భారీ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్త రన్ వే ప్రారంభం అయిన తరువాత దుబాయ్, సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కాగా నేటి నుండి మస్కట్ కు విమాన సర్వీసు ప్రారంభం అవుతోంది.
Read More:
1.Ganesh Festival: ఏపిలో హాట్ టాపిక్గా గణేష్ ఉత్సవాల రగడ..! నేడు గవర్నర్కు బీజేపీ నేతల ఫిర్యాదు..!!
2.AP Govt: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!!
3.Vellampalli Srinivas: వినాయక చవితి వేడుకలపై మంత్రి వెల్లంపల్లి ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!