ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,37,738 క్యూసెక్కులు వస్తుండగా, 1,60,021 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.50 అడుగులుగా కొనసాగుతుంది.
శ్రైశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ 2015.8070 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 212.9198 టీఎంసీల గా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగుుల కాగా, ప్రస్తుతం 589.7 అడుగులుగా కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 99,709 క్యూసెక్కులు వరద వస్తుండగా అంతే మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో షాక్ .. ఆ నియామకంపై కీలక వ్యాఖ్యలు