ఏపి మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అనారోగ్యంకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన భాదపడుతుండటంతో కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితమే హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్స నిర్వహించారు.
ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రి ఐసీయులో చికిత్స పొందుతున్నారు. రెండు మూడు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, రెండు ముడు రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరో పదిహేను రోజుల తరువాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్స చేయాలని వైద్యులు తెలిపినట్లు తెలుస్తొంది. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పలువురు వైసీపీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి పరామర్శిస్తున్నారు.
బాబు నోట ఆ భాషనా..? కర్నూలులో సహనం కోల్పోయి వేరావేశంతో..