AP High Court: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలపై నారాయణపై 2020 లో సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేస్తూ..41ఏ నిబంధనలను అనుసరించాలని తెలిపింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.
రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారంటూ నారాయణపై వైసీపీ సర్కార్ కేసులు పెట్టింది. అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసుల అక్రమాలు జరిగినట్లుగా ప్రాధమికంగా నిర్దారించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ 1గా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ 2 గా నాటి మంత్రి నారాయణను చేర్చారు. దీనిపై అప్పటి నుండి నారాయణ న్యాయపోరాటం సాగిస్తున్నారు.
AP Political Survey: ఏపిలో అధికారం ఏ పార్టీకి..? ఎవరికి ఎన్ని అసెంబ్లీ సీట్లు..??