YSRCP: రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనబడుతోంది. ఓ పక్క అధికార వైసీపీని రాబోయే ఎన్నికల్లో ఓడించేందుకు జనసేన, టీడీపీ పొత్తుతో పోటీ చేస్తాయని వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల్లోనే నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారుతున్నారు. రీసెంట్ గా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత వైసీపీ కండువా కప్పుకోగా, తాజాగా సత్తెనపల్లికి చెందిన జనసేన, బీజేపి నేతలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పి ఇవేళ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరావు తన తనయుడు నితిన్ రెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన తో పాటు సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ పక్కాల సూరిబాబు కూడా వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్ గాదె సునీత తదితరులు పాల్గొన్నారు.
కాగా యర్రం వెంకటేశ్వరరెడ్డి సత్తెనపల్లి నుండి 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. అనంతరం 2019లో జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి 9,279 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆయన అనూహ్యంగా వైసీపీలో చేరారు. యర్రం వెంకటేశ్వరరెడ్డి, సూరిబాబులు జనసేన, బీజేపీలకు రాజీనామా చేసి వైసీపీలో చేరడం సంతోషకరమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నన్ను ఓడించాలని 2019లో నాదెండ్ల మనోహర్ కుట్ర పన్ని యర్రం వెంకటేశ్వరరెడ్డికి జనసేన టికెట్ ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఏ రోజూ ఆయనను పట్టించుకోలేదని విమర్శించారు. రాజకీయాల్లో జనసేన కుట్రలు ఎలా ఉంటాయో ప్రజలు గమనించాలన్ని మంత్రి అంబటి అన్నారు.
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తి యర్రం వెంకటేశ్వరరెడ్డి అని, ఆయన సేవలను అన్ని విధాలా ఉపయోగించుకుంటామని తెలిపారు. యర్రం వెంకటేశ్వరరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, 2019లో మా వాళ్లు జనసేనలో చేరమంటే చేరానన్నారు. అప్పట్లో నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి టికెట్ ఇచ్చారన్నారు. జనసేన వాళ్లు ఇటీవల మీటింగ్ పెట్టి కూడా తనను పిలవలేదని చెప్పారు. తాను వైసీపీలో చేరడం వల్ల తన వర్గీయులు హ్యాపీగా ఉన్నారని తెలిపారు. మున్ముందు పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. మరో నేత సూరిబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ 2014లో పెదకూరపాడు నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేసాననీ, ఆ తర్వాత ఎంపిగా పోటీ చేశానన్నారు. 30 ఏళ్లుగా అంబటి రాంబాబు తనకు తెలుసుననీ, ఆయన వైసీపీలోకి రమ్మని ఆహ్వానించారని చెప్పారు.
AP Govt: ఏపిలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..వారికి మాత్రమే