Road Accident: బాపట్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లాకు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం వేమూరు మండలం జంపని గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ వాహనంలో అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. 16 మంది గాయపడగా వారిని హుటాహుటిన తెనాలి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు కన్నుమూశారు.
మృతులు కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం నిలపూడి గ్రామానికి చెందిన బొల్లిశెట్టి పాండురంగారావు, బుద్దన పవన్ కుమార్, బార్డటి రమేష్, పాశం రమేష్ లు గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో 22 మంది ఉన్నారని సమాచారం. పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TRS MLC Kavitha: సీబీఐ విచారణకు సహకరిస్తా.. కానీ