Road Accident: అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చెన్నై – కర్నూలు జాతీయ రహదారిపై అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచయాతీ కొత్తపల్లి క్రాస్ వద్ద రెండు కార్లు ఢీకొట్టన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ కు చెందిన పెనమాక లక్ష్మమ్మ (65) పక్షవాతంతో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి కారులో తీసుకువెళుతున్నారు. కొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మతో పాటు ఆమె కుమారుడ నర్సయ్య (41), కారు డ్రైవర్ రాజారెడ్డి (35) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న ఆమె బంధువు చిన్నక్క (60), బాలుడు హర్షవర్థన్ తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చిన్నక్క మృతి చెందింది. మరో కారులోని ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ లో దారుణం .. చిన్నారి సహా దంపతులు సజీవ దహనం