Road Accident: ఏపిలోని తిరుపతి రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్లోడ్డుపల్లి వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ పమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో మృతి చెందిన వారు, గాయపడిన వారు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. వీరు తిరుమల దర్శనం అనంతరం కారులో కాణిపాకం వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.