G Pay: గూగూల్ మొబైల్ పేమెంట్ యాప్ అయిన గూగూల్ పే (జీపే) పై ఇటీవల కాలంలో వినియోగదారులకు అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం జీపేకు ఆర్బీఐ అధికారిక అనుమతి లేకుండానే ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తోందని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు కాగా విచారణ జరుపుతోంది. గూగూల్ పే పేమెంట్ సిస్టమ్ లా వ్యవహరిస్తోందనీ, ఇది పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్స్ యాక్ట్ కు విరుద్ధమని అభిజిత్ మిశ్రా పేర్కొంటున్నారు. ఇలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహణకు ఆర్ బీ ఐ నుండి ఎటువంటి అనుమతులు లేవని తన పిల్ లో ఆయన ఆరోపించారు. 2019 మార్చి 20న ఎన్పీసీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్స్ సిస్టమ్ ఆపరేటర్ల జాబితాలో గూగుల్ పే పేరు లేకపోవడాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు ఆర్ బీ ఐ ఇచ్చిన సమాధానం గూగుల్ పే యూజర్ లను సాధారణ ప్రజానీకాన్ని గందరగోళంలోకి నెట్టే విధంగా ఉంది. గూగుల్ పే అనేది ఒక యాప్ మాత్రమేననీ, ఇది చెల్లింపులకు ఒక వాహకంగా మాత్రమే పని చేస్తుంది తప్ప దానంతట అదే చెల్లింపుల కార్యకలాపాలు నిర్వహించదని, ఇది పేమెంట్ ఆపరేటర్ కాదని వెల్లడించింది. గూగుల్ పే అనేది థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ మాత్రమేననీ, అది ఎలాంటి పేమెంట్ సిస్టమ్ ను నిర్వహించడం లేదని కోర్టుకు ఆర్ బీఐ తెలిపింది. ఈ సమాధానంతో యూజర్ ల గందరగోళానికి కారణం అవుతోంది. గూగుల్ పే చట్టబద్దమైనది కాదని, జీపే ద్వారా కార్యకలాపాల నిర్వహణ ఇబ్బందులతో కూడుకున్నదని కొందరు నమ్ముతున్నారు.
Read More: Ram – Kruthi: పట్టాలెక్కనున్న రామ్ – కృతి సినిమా..!!
ఈ నేపథ్యంల్ గూగుల్ పే ఒక ప్రకటన విడుదల చేసింది. గూగుల్ పే పూర్తిగా చట్టబద్దమైనదని, యుపీఐ ద్వారా చెల్లింపులు జరిపేందుకు గూగుల్ పే తన బ్యాంకు పార్టనర్లకు కేవలం సాంకేతిక సేవలను మాత్రమే అందిస్తుందని చెప్పింది. యూపీఐ యాప్ లను థర్డ్ పార్టీ యాప్ లుగా విభజించారు. గూగుల్ పే ద్వారా చేసే చెల్లింపులు అన్ని ఆర్ బీ ఐ, ఎన్సీపీఐ నియమాలకు అనుగుణంగా జరుగుతున్నాయని, అందు వల్ల అవన్నీ పూర్తిగా సురక్షితమైనవని తెలియజేస్తూ.. ఈ విషయంలో ఏలాంటి సమస్యలు తలెత్తినా 24 గంటలు అందుబాటులో ఉండే గూగుల్ పే వినియోగదారుల సెంటర్ల ద్వారా యూజర్లు పరిష్కరించుకోవచ్చని చెప్పింది. ఆర్ బీఐ ప్రకటనను కొందరు సోషల్ మీడియాలో తప్పుడు భాష్యాలను ఆపాదిస్తున్నారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఈ వ్యవహారాలు థర్డ్ పార్టీ యాప్ లు అన్నింటినీ ప్రభావితం చేసేది కాబట్టి లోతైన విచారణ అవసరం అని భావించింది. తదుపరి విచారణన ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.