Gadapa gadapaku mana Prabhutvam: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పండుగ లా నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలని ఆదేశించింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. ప్రజల నుండి సలహాలు, సూచనలు స్వీకరించాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది. నియోజకవర్గంలోని అన్ని ఇళ్లులు వెళ్లేంత వరకూ కార్యక్రమాన్ని కొనసాగించాలని తెలిపింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తొలుత పార్టీ పరంగా గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంగా నిర్వహించాలని పార్టీ తలపెట్టింది. అయితే జగన్మోహనరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలతో ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేపటి నుండి ప్రారంభం కానున్న గడప గడపకు మన ప్రబుత్వం కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి లోటుపాట్లు ఉంటే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. మ్యానిఫెస్టోలో 95 శాతం హామీలు చేసిన విషయాన్ని ప్రజలకు వివరించాలని సజ్జల చెప్పారు.