Gas Cylinder Blast: ఇటీవల పలు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ అగ్రిటెక్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన సమాచారం ప్రకారం మదనపల్లె ఇండస్ట్రియల్ ఏరియాలోని టీపీ అగ్రిటెక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.
Read More: WHO: ఆంక్షల ఎత్తివేయడంపై డబ్ల్యుహెచ్ఓ కీలక వ్యాఖ్యలు..! పాలకులు పట్టించుకుంటారా మరీ..!?
కంపెనీలో యూకలిప్టస్ ఆయిల్ నాణ్యత పరిశీలించే గ్యాస్ క్రోమాటో గ్రఫీ యంత్రం బిగిస్తుండగా సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన టెక్నీషియన్ లింగప్ప (42) మృతి చెందగా, పరిశ్రమ యజమాని శివ మహేష్, వర్కర్ బాషా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం తెలిసిన వెంటనే మదనపల్లి టూ టౌన్ సీ ఐ నరసింహులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక అధికారి మాటు సుభాన్ జరిగిన ప్రమాదంపై పరిశీలన జరిపారు.