Gautam Sawang: సాధారణంగా వివిధ శాఖల్లో ఉన్నతాధికారుల బదిలీలు ముఖ్యమంత్రుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే అధికారులకు పోస్టింగ్ లు ఉంటాయి. కీలకమైన స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్లను నియమించుకుంటుంటారు. వారిలో ఏమైనా తేడా కనబడితే ఆ స్థానాల నుండి తప్పిస్తుంటారు. చంద్రబాబు అయినా, జగన్ అయినా తమకు అనుకూలమైన అధికారులనే కీలక స్థానాల్లో వారికి ఇష్టమైన అధికారులను నియమించుకోవడం రివాజు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఏపి డీజీపీగా దాదాపు 30 నెలలు పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ ను జగన్ సర్కార్ బదిలీ చేయడంతో టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వం ఆయనకు అన్యాయం చేసింది అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
Read More: Breaking: గౌతమ్ సవాంగ్ కు మరో కీలక పోస్టు ఇచ్చిన జగన్ సర్కార్
Gautam Sawang: ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు
గౌతమ్ సవాంగ్ నిజాయితీ అధికారి అని పేరు ఉన్నప్పటికీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. ఈ విషయం ప్రజలకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు. పలు సందర్భాల్లో డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు కూడా చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు కానీ వైసీపీ నాయకులు ర్యాలీలు నిర్వహించినా, బహిరంగ సభలు పెట్టినా వారిపై ఎక్కడా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ టీడీపీ అనేక సందర్బాల్లో గగ్గోలు పెట్టింది.
వారి ఆవేదన అందరికీ ఆశ్చర్యం
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అంటూ కూడా చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. అలా నిన్న మొన్నటి వరకూ విమర్శించిన నేతలే ఇప్పుడు గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేయడంతో ఆవేదన చెందుతుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. వాస్తవానికి గౌతమ్ సవాంగ్ బదిలీ అవుతున్నారు అనే కంటే ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వస్తున్నారన్న బాధే ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. గౌతమ్ సవాంగ్ ను అడ్డగోలుగా వాడుకుని జగన్ వదిలేశారని టీడీపీ ఆరోపిస్తుంది.