Tirumala : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు మూడు కిలోల బంగారు శంకు, చక్రాలను విరాళంగా అందజేసి తన మొక్కుబడి చెల్లించుకున్నారు. తమిళనాడులోని తేని జిల్లా బోడినాయగనూరుకు చెందిన తంగదురై..తిరుమల శ్రీవారి భక్తుడు. గత పదేళ్లలో ప్లాటినం యజ్ఞోపవీతం, బంగారు పాదాలు, దశవతారాల విగ్రహాలు, సూర్యకఠారి. అభయహస్తం స్వామివారికి విరాళంగా సమర్పించారు.
ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న తంగదురై నేడు 2.5 కోట్ల విలువైన మూడు కిలోల బంగారు శంకు, చక్రాలను టీటీడీ అధికారులకు అందజేసి తన మొక్కుబడి చెల్లించుకున్నారు.