సంక్రాంతి అంటే సంబురాలు ఎంత గుర్తుకు వస్తాయో…. ఏపీలో జరిగే కోడి పందేలు అంతే గుర్తుకు వస్తాయి. అయితే , కోడి పందేలా విషయంలో గత కొద్ది కాలంగా వివాదం నెలకొంటోంది. కోర్టు మెట్లు కూడా ఎక్కిన పరిస్థితి.
కోడి పందేలకు అనుమతుల విషయం ప్రతి ఏడాది ఎంతో ఉత్కంఠ నెలకొంటోంది. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు లో జల్లికట్టు కు అనుమతి విషయంలోనూ ఇదే సమస్య. అయితే, జల్లికట్టు విషయంలో కీలక అప్డేట్ వచ్చింది.
జల్లికట్టు కు ఓకే
దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకువచ్చేది జల్లికట్టు. తమిళ ప్రజలైతే సంక్రాంతి పండుగ అంటే జల్లికట్టు ఉండాల్సిందే అంటారు. అయితే, కరోనా వల్ల పండుగలకు, వేడుకలకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి అనుమతులు ఇవ్వకపోవడంతో తమిళ తంబిలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జల్లికట్టుకు తమ పండుగలో ఎంతోకు ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఏదేమైనా తాము ఈ వేడుకను జరిపి తీరుతామని తమిళ ప్రజలు కోర్టును ఆశ్రయించారు. అయితే కరోనా క్రమంలో జల్లికట్టు నిర్వహిస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.
తమిళనాడు ప్రభుత్వం ఎంట్రీ
కరోనా కారణంగా జాగ్రత్తలు పాటిస్తూ జల్లికట్టు వేడుకను నిర్వహించుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జల్లికట్టు నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే జల్లికట్టులో పాల్గొనాలని, సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు, శానిటైజర్లు వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తానికి కరోనా సమయంలో కూడా జల్లికట్టు వేడుకకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం దాని నిర్వహణకు అనుమతినివ్వడంతో తమిళనాడు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జల్లికట్టుకు పొరుగు రాష్ట్రం అనుమతి ఇచ్చినప్పుడు ఏపీలో కోడి పందేలకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చునని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో మరి.!