దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడుతోంది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దమైంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ల తరలింపుకు అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో టీకాలు మన నగరానికి చేరబోతున్నాయి.
కేంద్ర మంత్రి రివ్యూ…
దేశవ్యాప్తంగా త్వరలో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్త్ మినిస్టర్లతో కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ వర్చువల్గా సమావేశమయ్యారు. దేశంలోని 4 రాష్ట్రాల్లో జరిగిన డ్రై రన్ వివరాలను రివ్యూ చేశామని, ఆ ప్రకారం జనవరి 8వ తేదీన జరిగే మరో డ్రై రన్కు ఏర్పాట్లు చేశామని మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ‘టీకాను తక్కువ సమయంలో అభివృద్ధి చేయడంలో ఇండియా విజయవంతమైంది. మరికొద్ది రోజుల్లోనే దేశ ప్రజలకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తెస్తాం. తొలుత హెల్త్ కేర్ వర్కర్స్తోపాటు ఫ్రంట్లైన్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ చేస్తాం. వ్యాక్సినేషన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది హెల్త్ కేర్ వర్కర్స్కు ట్రెయినింగ్ ఇచ్చాం. అది ఇంకా కొనసాగుతోంది’ అని హర్ష వర్దన్ చెప్పారు.
ఎక్కడి నుంచి ఎలా ?
పుణె సెంటర్గా దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసిన 41 సెంటర్లకు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నారు. నార్త్ ఇండియా మొత్తానికి ఢిల్లీ, హర్యానాలోని కర్నాల్ నుంచి వ్యాక్సిన్లను పంపనున్నారు. ఈస్ట్ ఇండియాకు కోల్కతా, సౌత్ ఇండియాకు చెన్నై, హైదరాబాద్ హబ్గా పని చేయనున్నాయి.
రంగంలోకి ప్రధాని మోడీ
ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై ఏర్పాట్లు జరగుతుండగా… ఈ నెల 11న సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీకానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుంది. , టీకా పంపిణీ, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు వంటి ప్రధాన అంశాలపై సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించనున్నారు .
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?