Corona : భారతీయులకు గుడ్ న్యూస్. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ తర్వాత అనుమతి లభించిన మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్ అవుతుంది.
ఇప్పుడే మూడో టీకా…
స్పుత్నిక్-వి ద్వారా దేశంలో మూడో టీకా కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. డీజీసీఐ అనుమతి లభిస్తే , త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న రెండు టీ త్వరలో రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. దీంతో దేశంలో టీకా కొరత కు పరిష్కారం దొరకనుందని భావిస్తున్నారు.
ఇప్పుడు ఏం జరుగుతోంది?
ఇదిలాఉండగా, దేశంలో కరోనా యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. లక్షల మంది ప్రజలు దీనిని బలయ్యారు. అయితే రికవరీ రేటు పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 5 లక్షలకంటే తక్కువగా కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 106 రోజుల్లో ఇదే అత్యల్పమని తెలిపింది. తాజాగా నమోదైన 44,281 కొత్త కేసులతో కలుపుకొని దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షల 36 వేల 11 మంది కరోనా బారిన పడగా.. వారిలో 80, 13, 7వందల 83 మంది కోలుకున్నారని, లక్షా 27వేల 5వందల 71మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. కాగా 4లక్షల, 94 వేల 6 వందల 57 మంది ఇంకా కరోనా చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.