KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సరైన టైంలో గుడ్ న్యూస్ వచ్చింది. ఇక తెలంగాణలో వ్యాక్సిన్ కొరత కారణంగా అనేక మంది వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి వెనక్కి వెళ్తున్నారు. అదే విధంగా, వ్యాక్సిన్ కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. మే 1 నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అంగీకరించిన సమయంలో సరిపడా వ్యాక్సిన్ లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో పూణే నుంచి కోవిషీల్డ్ టీకాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి.
తెలంగాణలో ఇది జరుగుతుంది
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, టీకా కొరతలు ఉన్నాయి. ఈ సమయంలోనే పూణే నుంచి కోవిషీల్డ్ టీకాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి. అక్కడి నుంచి వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల ప్రకారం వివిధ జిల్లాలకు వాటిని పంపిణి చేయాల్సి ఉంటుంది.
మంత్రి ఏమంటున్నారంటే…
మరోవైపు వ్యాక్సినేషన్పై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కేంద్రం కేటాయించే వ్యాక్సిన్లను బట్టి రాష్ర్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో 1.75 కోట్ల మంది యువత ఉన్నారు.. మాకు రెండు డోసులకు 3.50 కోట్ల వ్యాక్సిన్లు కావాలన్న ఆయన.. వాక్సిన్ విషయంలో కేంద్రం పునరాలోచించాలన్నారు.. కేంద్రమే వాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకాలు వచ్చే పరిస్థితిని బట్టి ఇక్కడ ప్లాన్ చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.