వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి చెందిన ఓ వీడియో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసింది.మాధవ్ ఒంటిపై ఎటువంటి బట్టలు లేకుండా ఉన్న వీడియో పై వైసీపీ ప్రత్యర్థ పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ వీడియో పై రాష్ట్ర పోలీసు శాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి అన్ని పరీక్షలు చేసి అది ఫేక్ వీడియో అని తాజాగా రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటన చేయడం జరిగింది. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియాలో చాలాసార్లు షేర్ అయినందువల్ల వీడియో ఒరిజినలా? నకిలీదా అనేది తేల్చడం చాలా కష్టమైందని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎంపీకి చెందిన వీడియోగా వైరల్ అవుతున్న ఈ వీడియోని ఇంగ్లాండ్ లో రిజిస్టర్ అయిన నెంబర్ నుండి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటం జరిగింది.
ఫస్ట్ ఐ టీడీపీకి చెందిన వాట్స్అప్ గ్రూప్ లో షేర్ అయిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఎంపీ గోరంట్ల మాధవ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంగ్లాండ్ నెంబర్ కలిగిన ఆ వ్యక్తి యొక్క వివరాలు సేకరిస్తున్నట్లు విచారణ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో యొక్క ఒరిజినల్ వీడియో అందుబాటులో ఉంటేనే ఇంకా పూర్తి సమాచారం లభిస్తుందని తెలిపారు. మరో పక్క ఇదే విషయంపై ఎంపీ గోరింట మాధవ్ మాట్లాడుతూ.. మొదటి నుండి ఇది తనపై ఒక కుట్రగా టిడిపి వాళ్ళు చేస్తున్న ప్రచారం అని తెలిపారు.
అది నకిలీ వీడియో ని ముందే చెప్పినట్లు కూడా తాజాగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ ఫేక్ వీడియోని పెద్దగా పట్టించుకోలేదని కూడా స్పష్టం చేశారు. అయినా కానీ వీడియో పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కచ్చితంగా ఈ వ్యవహారంలో కడిగిన ముత్యంలా బయటపడతానని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనని ఇబ్బంది పెట్టడానికి చచ్చిపోయిన టీడీపీ పార్టీని మళ్లీ బతికించుకోవడానికి చంద్రబాబు తనపై ప్రయోగించిన కుట్రని గోరంట్ల మాధవ్ ఆరోపించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?