NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Grama Panchayats: ఆందోళన బాట పట్టిన సర్పంచ్‌లు..పంచాయతీ నిధులు వెనక్కి పంపిన ప్రభుత్వం

Grama Panchayats: ఏపిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ అకౌంట్‌లకు నిధులు వెనక్కు వచ్చేశాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లోని నిధులు రాత్రికి రాత్రి మాయం అయ్యాయి. గతంలో 14, 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.7.600 కోట్లను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు తెలియకుండానే ప్రభుత్వం తీసేసుకుని విద్యుత్ చార్జీలకు చెల్లించింది. ఇప్పుడు కూడా అలానే ప్రభుత్వం గ్రామ పంచాయతీల సాధారణ నిధులను ప్రభుత్వం తీసేసుకుందని గ్రామ పంచాయతీ సర్పంచ్ లు భావించారు. ఈ నెల 2వ తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల బ్యాంక్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ చూపడంతో సర్పంచ్ లు షాక్ అయ్యారు. దీనిపై ప్రభుత్వ అధికారులు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే కొందరు కార్యదర్శులు మాత్రం ఇయర్ ఎండింగ్ కావడంతో సాంకేతిక లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. రెండు మూడు రోజుల్లో నిధులు వెనక్కి వస్తాయని భావించారు. అయితే ఈ నెల 5వ తేదీ వరకూ పంచాయతీ అకౌంట్ లకు నిధులు వెనక్కు రాలేదు. అధికారులు దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వమే నిధులు మళ్లించిందని సర్పంచ్ లు అనుకున్నారు. దీనిపై సర్పంచ్ లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Grama Panchayats: సర్పంచ్ లు భిక్షాటనతో నిరసన

రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన 12,918 గ్రామ పంచాయతీల నిధులను వెంటనే తిరిగి పంచాయతీల ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపి పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విజయవాడలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ సర్పంచ్ లు భిక్షాటనతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిధులు వెనక్కు ఇవ్వకపోతే గ్రామస్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ లు అందరూ కలిసి ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులను సైతం ప్రభుత్వం తీసేసుకుంటే గ్రామాల్లో పనులు ఎలా సాగుతాయంటూ సర్పంచ్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ ఖాతాలకు నిధులు జమ

ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం 14,15 వ ఆర్ధిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు పంపిన నిధులు రూ.7,660 కోట్లు ప్రభుత్వం తీసుకోగా ఇప్పుడు తాజాగా ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఇతర జనరల్ ఫండ్స్ ద్వారా గ్రామ పంచాయతీ ఖాతాల్లో ఉన్న రూ.4వేల కోట్లను సర్పంచ్ లకు చెప్పకుండా, వారి సంతకం లేకుండా రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుందని బాబూ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలా చేస్తే గ్రామాల్లో ప్రజలకు సర్పంచ్ లు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికేనా ఆర్ధిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నిధులు మొత్తం రూ.11, 600 కోట్లు వెంటనే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఓ పక్క సర్పంచ్ లు ఆందోళనలు చేస్తున్న తరుణంలోనే బుధవారం గ్రామ పంచాయతీ ఖాతాలకు జనరల్ ఫండ్ నిధులు జమ అయ్యాయి. దీంతో సర్పంచ్ లు, కార్యదర్శులు ఊపిరిపీల్చుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk