ఏపీ సీఎం వైయస్ జగన్ ఆలోచన నుండి పుట్టుకొచ్చిన grama sachivalayam వ్యవస్థ చాలావరకు ఏపీ ప్రజల కష్టాలను తీరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పనులు అయినా మూడు రోజుల్లో అయిపోయేలా ప్రజలకు సేవలు అందించేలా జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ అవస్థలు నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడికక్కడ పాలన అన్నట్టు ప్రజలెవరూ నాయకుల చుట్టూ తిరగకుండా జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థ పట్ల దేశ వ్యాప్తంగా తల పండిపోయిన నాయకులు సైతం ప్రశంసిస్తూ ఉన్నారు.
ప్రధాని మోడీ కూడా ఇలాంటి వ్యవస్థ దేశంలో ఇతర రాష్ట్రాల నాయకులు అనుసరిస్తే బాగుంటుంది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పెన్షన్ విషయంలో ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన పథకాల విషయంలో గ్రామ సచివాలయ సిబ్బంది అదేవిధంగా వాలంటీర్ల చేత ప్రభుత్వ పనులు చకచకా అయ్యేలా వ్యవస్థను నడిపిస్తున్నారు. ఎక్స్ ప్రెస్ వేగంతో పనిచేస్తూ ప్రజల అవసరాలను తీరుస్తున్న ఈ వ్యవస్థ శ్రీకాకుళం జిల్లాలో సరికొత్త రికార్డు సృష్టించింది.
జగన్ గ్రామ సచివాలయ ( grama sachivalayam ) వ్యవస్థ సరికొత్త రికార్డ్:-
మేటర్ లోకి వెళితే ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆమె చికిత్స నిమిత్తం బెంగళూరు వెళ్లగా ఆ చికిత్స కి ఆరోగ్యశ్రీ కార్డు ఉండటంతో ఆమెకు లేకపోవటంతో ఎనిమిది గంటల్లోనే .. ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేలా గ్రామ సచివాలయ సిబ్బంది అందించటం మాత్రమేకాక రోగికి సంబంధించిన వాలెంటర్ ఏకంగా పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరు వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేయడంలో మాత్రమేకాక రేషన్ కార్డు అదేవిధంగా పెన్షన్ల విషయంలో గతంలో కంటే గ్రామ సచివాలయ పనితీరు చాలా వేగంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు .. గ్రామ మరియు వాలంటీర్ల వ్యవస్థ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు చుట్టూ మరియు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే తమ దగ్గరికి వచ్చి అవసరతలు తీరుస్తోంది అంటూ కొనియాడుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?