YCP : పులపాలక ఎన్నికల ఫలితాల్లో గుంటూరు జిల్లాలోనూ అధికార వైసీపీ తన హవా చాటింది. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్ కు ఎన్నికలు జరగ్గా రేపల్లె, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట మున్సిపాలిటీలు వైసీపీ కైవశం చేసుకుంది.
గుంటూరు నగర పాలక సంస్థ లో మొత్తం 57 డివిజన్ లలో ఒకటి గతంలోనే ఏకగ్రీవం కాగా మిగిలిన 56 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకూ 24 డివిజన్ ఫలితాలు వెల్లడి కాగా అందులో 19 వార్డుల్లో వైసీపీ, మూడు టేడీపీ, జనసేన ఒక వార్డుల్లో గెలిచింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.