Hanuman Birth Place Debate: ఆంజనేయుడి జన్మస్థలం తిరుమలలోని అంజనేయాద్రి అని ఇటీవల శ్రీరామనవమి నాడు టీటీడీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమంతుడి జన్మస్థలంపై చాలా కాలం క్రితమే ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హనుమత్ ఉపాసనాపరులు, విశ్రాంత సంస్కృత అధ్యాపకులు డాక్టర్ చిదంబర శాస్త్రి అనేక పరిశోధనలు జరిపి తిరుమలలోని ఆంజనేయాద్రే ఆంజనేయుడు జన్మస్థలమని టీటీడీకి లేఖలు రాయడంతో పాటు ప్రచార ఉద్యమాన్ని నిర్వహించారు.
ఈ తరుణంలోనే టీటీడీ ఆంజనేయుడి జన్మస్థలం అధ్యయనానికి టీటీడీ ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అధ్యయన కమిటీ పరిశోధన జరిపి ఆంజనేయాద్రియే ఆంజనేయుడు జన్మస్థలం అని నిర్ధారణ చేసింది. ఈ విషయాన్ని ఇటీవల శ్రీరామనవమి నాడు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చర్చించేందుకు సిద్ధమని, అధారాలు చూపుతామని కూడా కమిటీ చెప్పింది. టీటీడీ ప్రకటనపై కిష్కింద హనుమత్ తీర్థ జన్మస్థల క్షేత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ చెబుతున్న విషయాలు అసంబద్ధంగా ఉన్నాయని ఘాటుగా విమర్శించడంతో పాటు దీనిపై చర్చకు సిద్ధమంటూ కూడా సవాల్ చేసింది. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన కిష్కింద హనుమ తీర్థ జన్మస్థల క్షేత్రం వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి ఆంజనేయుడి జన్మస్థలం అంశంపై తరువాత చర్చలో పాల్గొంటామని తెలిపారు.
Read More: MK Stalin: స్టాలిన్ది ఎంత దొడ్డ మనసో..!!
ఈ నేపథ్యంలో హనుమంతుడి జన్మస్థలం వివాదంపై గురువారం (నేడు) తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో చర్చ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. కిష్కింద ట్రస్ట్ తరపున గోవిందానంద సరస్వతి చర్చలో పాల్గొంటుండగా టీటీడీ తరుపున కమిటీ కన్వీనర్, సభ్యులు పాల్గొననున్నారు. ఇరుపక్ష అధారాలపై వాద ప్రతివాదాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీటీడీ, కిష్కింద పండితుల మధ్య వాదోపవాదాలు ఎలా జరుగుతాయి, వీరి మధ్య జరిగే చర్చలో ఒక క్లారిటీ వస్తుందా అనేది సర్వత్రా ఆసక్తినెలకొంది.