Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు రాజకీయాల్లో విభిన్నమైన వ్యక్తిత్వం ఉన్న నేత అనే సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ అనే గుర్తింపు పొందిన ఈ ముఖ్య నేత పుట్టిన రోజు నేడు. అయితే, తన పుట్టిన రోజు పురస్కరించుకొని హరీశ్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More: Harish Rao: హరీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయినట్లేనా?
హరీశ్ రావు ఏమంటున్నారంటే…
కరోనా , లాక్ డౌన్ కారణంగా ఈ సారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, కరోనా కారణంగా అభిమానులను కలవలేక పోతున్నట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనా సమయంలో స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు.. నా పుట్టిన రోజు (జూన్ 3) న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు.’ అంటూ ట్విటర్ ద్వారా హరీశ్ రావు చెప్పారు.
Read More : Harish Rao: ఇటు కేటీఆర్ , అటు హరీశ్ రావు… కేంద్రంపై ఉక్కిరిబిక్కిరి
ఆ పనుల్లో హరీశ్ రావు బిజీ బిజీ
ఇదిలాఉండగా గత కొద్దిరోజులుగా మళ్లీ టీఆర్ఎస్ లో హరీశ్ రావు కు ప్రాధాన్యం దక్కుతోందని అంటున్నారు. ఇటు పరిపాలనలో అటు పార్టీలో అప్పజెప్తున్న బాధ్యతలే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో హరీశ్ రావుకు కీలక బాధ్యతలు అప్పజెప్తున్నారు. దీంతో పాటుగా మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గమైన హుజురాబాద్ లో చేపడుతున్న చర్యల్లో హరీశ్ కే అగ్రస్థానం అప్పజెప్పారు.