HCL: ఏపిలోని విద్యార్ధులకు హెచ్సీఎల్ టెక్నాలజీస్ గుడ్ న్యూస్ అందించింది. టెక్బీ శిక్షణ కోసం ఏపి నుండి 1,500 మంది ఇంటర్ విద్యార్ధులను ఎంపిక చేయనుంది. ఈ నెల 25న విజయవాడలో వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు హెచ్సీఎల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ తెలిపారు. 2021 లో మ్యాథమేటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ తో 12వ తరగతి (ఇంటర్) పూర్తి చేసిన వారు అలాగే 2022 లో ఇంటర్ లో చేరుతున్న విద్యార్ధులు ధరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వాక్ ఇన్ డ్రైవ్ లో ఎంపికైన విద్యార్ధులకు 12 నెలల పాటు శిక్షణ అందించడంతో పాటు ఇంటర్న్ షిప్ చేసే అవకాశం కూడా కల్పిస్తామని ఆయన వెల్లడించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
టెక్బీ శిక్షణ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ.1.70 లక్షల నుండి రూ.2.20 లక్షల వేతనంతో ఉద్యోగం లభిస్తుందని చెప్పారు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ వద్ద పని చేస్తూనే బిట్స్ పిలానీ, శస్త్ర, అమిటీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అర్హత కల్గిన వారు ఆన్ లైన్ కేరీర్ అప్టిట్యూడ్ టెస్ట్ (హెచ్సీఎల్ క్యాట్) కు హజరుకావాల్సి ఉంటుందని ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తామని తెలిపారు. ఇతర వివరాల కోసం సంస్థ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.