ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. మరో పక్క మున్నేరుకు వరద పెరగడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉదృతి అధికమైంది. గరిష్ట నీటి మట్టం 12 అడుగులు దాటి ప్రవహిస్తొంది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. 50 గేట్లను అర అడుగు మేర, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 80వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరో పక్క డెల్టా కాలువకు 5800 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలన చేస్తున్నారు.
ఎగువ ప్రాంతంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత ఎక్కువగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ కు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలో వరద దిగువకు విడుదల చేస్తామని అదికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్న పేదలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం లక్షకుపైగా క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేసే అవకాశం ఉంది.
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్లో లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…
ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…
అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్లో రిలీజ్ కానున్న 'లాల్ సింగ్ చడ్డా' సినిమాతో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్ ఖాన్…