పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాచర్లలో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాచర్లలో 144 సెక్షన్ విధించారు. మాచర్ల ఘటనతో టీడీపీ నేతల ఇళ్లవద్ద పోలీస్ పహారా కాస్తున్నారు.
గుంటూరులోని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర, జీవీ ఆనంజనేయులు ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. కీలక నేతల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తీరుతామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. చలో మాచర్లకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరామ్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శివరామ్ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివరామ్ కార్యాలయం వద్ద పోలీసులను మోహరించారు.
శుక్రవారం మాచర్లలో టీడీపీ ఇదేమి ఖర్మరా బాబు కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణ పడటం, ఆ తర్వాత టీడీపీ కార్యాలయం దగ్ధం, కార్ల ధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. శనివారం పోలీసులు మాచర్లలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వాళ్లు ఘర్షణలకు దిగారని జిల్లా ఎస్పీ నిన్న రాత్రి ప్రకటించారు.
మాచర్లలో టీడీపీ, వైసీపీ బాహాబాహీ .. ఉద్రిక్తత.. టీడీపీ కార్యాలయానికి నిప్పు.. వాహనాలు ధ్వంసం
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?