రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏస్ఈసీ) పిటిషన్ ను ఏపి హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నెల 8వ తేదీన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ ను విడుదల చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అధికారులు, ఉద్యోగులు ఏకకాలంలో రెండు విధులు నిర్వహించలేరని ప్రభుత్వం..ఎస్ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా నిన్న ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టివేసింది.
సింగిల్ జడ్జి తీర్పుపై ఎస్ఈసీ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయగా నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేసిన తర్వాత రద్దు చేయడం ఇంత వరకూ జరగలేదని వివరించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు, పోలింగ్ కు సంబంధం లేదని కూడా ఆయన వివరించారు. ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు విన్న డివిజన్ బెంచ్ విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి..బ్రేకింగ్ : పంచాయతీ పోల్స్పై హైకోర్టులో ఎస్ఈసీకి ఎదురుదెబ్బ