టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది,.కొత్త రోడ్డు జంక్షన్, పలాసలో భారీగా పోలీసులను మోహరించారు. పలాస టీడీపీ కార్యాలయం ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చింది. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ ప్రాంతాల్లో ఆంక్షలు విదిస్తూ జిల్లా ఎస్పీ రాధిక ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ విధించారు. ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులను మోహరించారు, ఆదివారం ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు.
నారా లోకేష్ కొద్ది సేపటి క్రితం శ్రీకాకుళం చేరుకోగా టీడీపీ నేతలు కళా వెంకట్రావు తదితరులు స్వాగతం పలికారు. కొత్త రోడ్డు జంక్షన్ వద్ద రోడ్డుపై పోలీసులు లారీలను అడ్డం గా పెట్టి లోకేష్ పలాస వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ లోకేష్ రోడ్డు పై భైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు నారా లోకేష్, కళా వెంకట్రావు తదితరులను అరెస్టు చేశారు.
గోపినగర్ హైవేలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో గౌతు శిరీష, శివాజీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సభలు సమావేశాలు నిర్వహించవద్దంటూ నోటీసులో పేర్కొన్నారు. పలాసలో టీడీపీ నేతలను టార్గెట్ గా చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారనీ, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుంటే నారా లోకేష్ ను అడ్డుకోవడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా టీ డీ పీ నేతలను అరెస్టు చేయడం జరిగిందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
వైద్యులకు వెయ్యి కోట్ల తాయిలాల ఆరోపణలపై స్పందించిన ‘డోలో 650’ సంస్థ ..ఇదీ క్లారిటీ