హై కోర్టు మధ్యవర్తిత్వం ఇప్పుడు కొత్తగా మారింది …. నిన్న మొన్నటి వరకు అయితే ప్రభుత్వం పై నిప్పులు చేరగటం… లేకుంటే వాయిదాలు, అభ్యన్తరాలు, అఫడవిట్లతో రమ్మనే కోర్టు బుధవారం రూటు మార్చింది. ఎన్నికల కమిషన్ తో ప్రభ్యత్వం పడుతున్న గొడవలో తానూ మధ్యవర్తిత్వం నెరిపేలా కొన్ని సూచనలు ఇవ్వడం హై లైట్ గ నిలుస్తోంది… అసలేం జరిగింది అంటే…
** స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం , ఎన్నికల కమిషన్ మధ్య పూర్తిస్థాయి విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే. కచ్చితంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఎన్నికల కమిషన్ భావిస్తుంటే కరోనా సమయంలో ఎన్నికలు సరికాదని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఎన్నో ఇంకేంన్నో వాదనలు, లేఖలు , వాదోపవాదాలు… ఆఖరికి బూతులు అయిపోయాయి.. ఇప్పుడు దీనిలో తుది తీర్పు ఇచ్చేందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషనర్ తో ఒకసారి మాట్లాడాలని … ఒక 5 మంది అధికారుల బృందం వెళ్లి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తో మాట్లాడి రావాలని సూచించింది… దాని తర్వాత ఎం చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వస్తామని చెప్పింది…
రాజి అవుతుందా ??
** ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ పదవీకాలం ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి అవుతుంది. ఈ సమయంలో కచ్చితంగా ఎన్నికలు నిర్వహించి పదవి విరమణ చేయాలనీ నిమ్మగడ్డ భావిస్తున్నారు.. దీనికి ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని విషయాలు ఆయనలో పట్టుదల పెంచాయి. ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది. న్యాయపరంగా వెళితే కచ్చితంగా నిమ్మగడ్డ ను ఎదుర్కోవడం తేలికైన పని కాదు.. ఎన్నికల కమిషన్ ఇప్పుడు అనుకుంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించే హక్కు , విధులు కలిగి ఉంది..
** మరో పక్క ప్రభుత్వం లో భాగం అయినా అధికారులు సైతం వెనక్కు తగ్గడానికి ఛాన్స్ లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దీనిపై సీరియస్ గ ఉండటంతో అధికారులు సైతం నిమ్మగడ్డ కు నచ్చ జెప్పేందుకు ప్రయత్నిస్తారు తప్పితే చేసేదేమి లేదు. నిమ్మగడ్డ వెళ్ళిపోయినా తరవాత ఎన్నికలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికి ప్లాన్ వేసింది. కచ్చితంగా ఆయనకు నచ్చజెప్పి ఎలాగో ఎన్నికల వాయిదాకు సహకరించేలా కోరడం తప్ప అధికారులు చేసేది ఏమి ఉండదు. అయితే మరో నెలలో పదవి నుంచి దిగిపోబుతున్న నిమ్మగడ్డ వెనక్కు తగ్గుతారా లేదా … లేక తన మాట ఉంటె పరిస్థితి ఏమిటి అన్నది కోర్టు పరిశీలనలోకి వెళ్తున్నది.
** రెండు అంశాల్లో పట్టు విడుపులు ఉండాలి అంటారు. కోర్టు ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తోంది. రాజ్యాంగం సంక్షోభం వచ్చే విషయాల్లో కోర్టు తమ అపరిమిత అధికారాలు ఉపయోగించి రాజి కి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు మన హైకోర్టు చేస్తున్నది ఇదే అని చెప్పాలి.. ఒక ప్రభుత్వానికి, సర్వ స్వతంత్ర వ్యవస్థకు మధ్య వచ్చే కొన్ని విషయాలను కోర్టు మధ్యవర్తిగా వచ్చి పరిష్కరించే అవకాశం ఉంది. గతం లోను ఎలాంటి విషయాల్లో కోర్టులు చురుగ్గా వ్యవహరించాయి అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.