అనంతపురం జిల్లా హిందూపుర్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఆయన నగ్నంగా మాట్లాడుతున్న వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ పై ఇంతకు ముందు వివాదాస్పద కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో కాల్ వైరల్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో కలకలాన్ని రేపింది.దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఒక బాధ్యాతయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మాధవ్ తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాధవ్ పై సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్ర, కుతంత్రంతో కొందరు వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడిగా ఎదుగుతున్నందు వల్లే ఓర్వలేక తనపై తప్పుడు వీడియో సెర్క్యులేట్ చేస్తూ అభాసుపాలు చేయాలని చూస్తున్నారన్నారు. దీనిపై ఏ విచారణకైనా సిద్ధమని చెప్పారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు గోరంట్ల మాధవ్. వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఫారెన్సిక్ టెస్ట్ కైనా తాను సిద్దమేనని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంట లు దీని వెనుక ఉన్నట్లు మాధవ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పరువునష్టం దావా కూడా వేస్తానని ఎంపీ మాధవ్ తెలిపారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ సంచలన వ్యాఖ్యలు