Bhumana Karunakar Reddy: గత ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తుల ఫోన్ లు ట్యాపింగ్ చేసిందని తమ కమిటీ నమ్ముతుందనీ, దీనిపై పూర్తి స్థాయి విచారణ పూర్తి చేస్తామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్ ద్వారా మానవ హక్కులను చోరీ చేసిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నియమించిన ఏపి శాసనసభా సంఘం (హౌస్ కమిటి) బుధవారం అసెంబ్లీలో సమావేశమైంది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సభ్యులు కరణం దర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహనరావు, మద్దాలి గిరిధర్ పాల్గొని ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్దంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి విచారించారు. హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో కమిటీ చర్చించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసెస్ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో ఏపిలోని చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని చెప్పడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అప్పటి విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్య పరికరాలను వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఏపి ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో భూమన చైర్మన్ గా హౌస్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం భేటీ అయిన హౌస్ కమిటీ.. ఈ రోజు హోం, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సంబంధిత సమాచారం కోసం చర్చించింది.
సమావేశం అనంతరం హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పెగాసస్ వ్యవహారంపై ప్రాధమికంగా చర్చించామని చెప్పారు. ఈ రోజు ప్రాధమిక విచారణ మాత్రమే జరిగిందనీ, వచ్చే సమావేశంలో పూర్తి స్థాయి విచారణ జరుపుతామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తామన్నారు. పెగాసస్ వ్యవహారంపై త్వరలోనే విషయాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. జూలై 5వ తేదీన మరో సారి కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దీనిపై ఆరోపణలు చేశామని కరుణాకర్ రెడ్డి అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?