మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ ప్రక్రియను ప్రారంభించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసును ఏపిలోని కడప నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల కడప నుండి కేసుకు సంబంధించి చార్జి షీట్లు ఇతర దస్త్రాలు మొత్తం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు చేరాయి. దీంతో వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ చార్జి షీట్ విచారణకు కోర్టు స్వీకరించింది. ఈ కేసుకు SC/01.2023 నెంబర్ ను న్యాయస్థానం కేటాయించింది. కేసు విచారణలో భాగంగా వివేకా కేసులో అయిదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు సమన్లు రాజీ అయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీ విచారణకు హజరు కావాలని నిందితులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరో పక్క ఈ కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న కడప ఎంపీ అవనాష్ రెడ్డి ఈ వేళ 3 గంటలకు సీబీఐ అధికారుల ముందు విచారణకు హజరుకానున్నారు. పులివెందుల నుండి రెండు రోజుల ముందే హైదరాబాద్ కు చేరుకున్న అవినాష్ రెడ్డి.. ఇవేళ ఉదయం లోటస్ పాండ్ కు వెళ్లి వైఎస్ విజయమ్మను కలిశారు. కాగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హజరు అవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పులివెందుల నుండి వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, అవినాష్ రెడ్డి అభిమానులు సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
ఇవేళ విచారణకు హజరు అవుతున్నట్లు పేర్కొన్న అవినాష్ రెడ్డి సీబీఐ అదికారులకు లిఖిత పూర్వకంగా లేఖ పంపారు. న్యాయవాది సమక్షంలో తమను విచారించాలని, విచారణ ఆడియో వీడియో లో రికార్డు చేయాలనీ, పారదర్శకంగా నిజాయితీగా విచారణ జరగాలని కోరారు. సీబీఐ విచారణకు పూర్తి గా సహకరిస్తానని తెలిపారు. మీడియా, సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేయకుండా సీబీఐ చర్యలు చేపట్టాలని, నిజం నిగ్గు తేలే వరకూ అందరు సంయమనం పాటించాలని, వాస్తవాలు వెలుగులోకి తెచ్చి దోషులను చట్టపరంగా శిక్షించాలని అవినాష్ రెడ్డి లేఖలో కోరారు. సీబీఐ అధికారుల ముందు తొలి సారిగా ఎంపీ అవినాష్ రెడ్డి హజరు కానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కుప్పకూలిన మూడు ఫైటర్ జెట్ విమానాలు ..సురక్షితంగా బయటపడిన ఇద్దరు పైలట్లు..ఒకరు మిస్సింగ్