Hyderabad: మీరు , మీ వారు కానీ హైదరాబాద్/ తెలంగాణలో ఉంటున్నారా? ఓ మూడు విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఇది మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కర్ఫ్యూ అమలుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇదే సమయంలో మూడు కీలక విషయాలు ముఖ్యమైనవి తెలుసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో ఓ కీలక నిర్ణయం
నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసుల సమయాన్ని కుదించింది. అత్యధిక మందికి అందుబాటులో ఉండే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ సర్వీసుల పరిస్థితి ఏంటి? అనే సందేహాలు అందరిలో వ్యక్తం అవుతోన్న సమయంలో తెలంగాణ ఆర్టీసీ సర్వీసులపై క్లారిటీ ఇచ్చింది. గత రాత్రి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు యథాతథంగా నడుస్తాయని తెలంగాణ ఆర్టీసీ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సు టికెట్లు చూపించి ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు అన్నారు. అయితే, రాత్రి 10 గంటలలోపు అన్ని బస్సులు డిపోలకు చేరుకుంటాయని యాదగిరి వివరణ ఇచ్చారు.
తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం…
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పటిష్టంగా తెలంగాణ పోలీసులు అమలు చేయనున్నారు. అన్ని జిల్లాల ఎస్పీలు కమిషనర్ల తో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు నుండి నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ స్టేట్ బోర్డర్ వద్ద ఆంక్షలు విధించనున్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో అధికారులతో పాటు జిల్లా పోలీస్ అధికారులకు డీజీపీ దిశా నిర్దేశం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?