ఏపిలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గతంలో ఏపీ సీఎంఒలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఎఎస్ ప్రవీణ్ ప్రకాష్ పలు బలమైన కారణాల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన బదిలీల్లో ఆయనను తిరిగి ఏపికి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు, రవాణా భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ కు ఏపి భవన్ రెసిడెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతను అప్పగించింది.
మరో సీనియర్ అధికారి వీరపాండ్యన్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ విజయానంద్ కు సీఎస్ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
YSRCP: ఎన్నికలు రేపు అన్నట్లుగా క్యాడర్ పని చేయాలని ఉద్భోదించిన వైసీపీ నేత, సీఎం వైఎస్ జగన్