Amaravati: రాష్ట్రంలో పలువురు అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఆర్ గోవిందరావు, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా పర్మాన్ అహ్మద్ ఖాన్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అలానే బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ కు వీసీ, ఎండిగా జి క్రైస్ట్ కిషోర్ కుమార్, ఢిల్లీలో ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమీషనర్గా హిమాన్షు కౌషిక్, కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్గా భరత్ తేజ ను నియమించింది. గ్రామాల సర్వే, మ్యాపింగ్ స్వామిత్వ కార్యక్రమం స్పెషల్ కమీషనర్గా ఏ సిరి, ఇన్సురెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్టమెంట్ డైరెక్టర్గా వి ఆంజనేయులు, ఆయుష్ కమిషర్గా ఎస్బీఆర్ కుమార్లకు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
NTR Satha Jayanthi: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా .. రీజన్ ఇదే..!