IAS Transfers: ఏపిలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రిజియన్ డవలప్ మెంట్ ఏరియా (ఏఎంఆర్డీఏ) కమిషనర్ గా కె విజయ, ఏఎంఆర్ డీఏ అడిషనల్ కమిషనర్ గా పి ప్రశాంతి, సీసీఎల్ ఏ అప్పీల్స్ కమిషనర్ గా డాక్టర్ పి లక్ష్మీనరసింహం, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా రాజకుమారి. కడప ఆర్ డీ ఓ గా పి రామచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటి కార్యదర్శిగా పృథ్వీతేజ్ లు బదిలీ అయ్యారు.
రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో జగన్ సర్కార్ సీఆర్డీఏ ను రద్దు చేసి దాని స్థానంలో ఏఎంఆర్డీఏ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.