NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రామ‌తీర్థం ఘ‌ట‌న‌ దోషులు దొరికిపోయారా?

humiliations to ycp and tdp over ramateerdham issue

రామతీర్థం కోదండ రామాల‌యం…. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ పుణ్య‌క్షేత్రం కొద్దికాలం కింద‌టి వ‌ర‌కు జిల్లా వాసుల‌కు , ఇరుగుపొరుగు జిల్లాల వారికే సుప‌రిచితం. అయితే, కోదండ రాముని విగ్రహం ద్వంసం ఘటనతో ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కింది. మ‌రోవైపు రోజురోజుకి రాజకీయ రంగు పులుముకుంటోంది. అయితే, ఈ ఘ‌ట‌న‌పై తాజాగా కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

humiliations to ycp and tdp over ramateerdham issue

జ‌గ‌న్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

రామ‌తీర్థం ఘ‌ట‌న‌పై వివాదాలు చెల‌రేగుతుండ‌టంతో ప్ర‌భుత్వం ప‌క్కాగా విచార‌ణ చేస్తోంది. ఐదు ప్రత్యే క బృందాలతో పాటు ఇంటలిజెన్స్‌ , సిఐడి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించి .. అనుమానం ఉన్న ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. ముప్పై మందికి పైగా అనుమానితులను విచారిస్తున్నారు. సెల్ టవర్ సిగ్నల్ ఆదారంగా ఘటన జరిగిన రోజు ఆ ప్రాంతంలో సంచరించిన వారిని దర్యాప్తు బృందాలు విచారిస్తున్నాయి .

వాళ్లే చేశారా?

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఐదు ప్రత్యే క బృందాలతో పాటు ఇంటలిజెన్స్‌ , సిఐడి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించిన‌ ప్రభుత్వం ప్ర‌తి అంశాన్ని ప‌క్కాగా విశ్లేషిస్తోంది. స్థానికుల ప్ర‌మేయం లేకుండా ఘటన జరగదనే అనుమానం పోలీసులు ఉన్న‌తాధికారులు వ్యక్తం చేయడంతో స్థానిక నేతలను సైతం విచారిస్తున్నారు. నలుగురు కీలక అనుమానితిలను సైతం విచారిస్తున్నారు. రామతీర్ధం ఘటనలో విచారణ కోసం మాజీ సర్పంచ్ భర్త కోటపాటి తిరుపతిరావుని విచారణకు పిలిచి ఆయన వేలి ముద్రలను తీసుకున్నారు. దేవాలయంలో పనిచేస్తూ, కొంతకాలంగా విధులకు గైర్హాజరు అయిన ఉద్యోగిని సైతం విచారణ చేశారు. గతంలో దేవాలయాలులో దొంగతనాలు చేసే నిందితులను సైతం విచారణ కు దర్యాప్తు అధికారులు పిలుస్తున్నారు.

ఆ ఒక్క పార్టీనే టార్గెట్ చేశారా?

అయితే , రామ‌తీర్థం ఘ‌ట‌న‌లో దోషుల‌ను తేల్చేందుకు ఒక్క పార్టీకి చెందిన వ్యక్తులనే టార్గేట్ చేసి విచారణ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై జిల్లా ఎస్పీ రాజకుమారి స్పందిస్తూ విచారణ నిస్పక్షపాతంగా జరుపుతున్నామని వెల్ల‌డించారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ ప్రాథమిక ఆధారాలు సేకరించామని . సాంకేతిక ఆదారాలు సైతం సేకరిస్తున్నామన్నారు. నిందితుల్నిత్వరలో పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేసారు .. ప్రజలంతా సంయమనం పాటించాలని ఎస్పీ కోరారు. మరోవైపు జిల్లాలో శాంతి భ‌ద్రతల సమస్య తలెత్తకుండా సర్వమత పెద్దలతో కలిపి ప్రత్యేక కమిటీలను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. రామతీర్దం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30 ని అమలు చేస్తున్న పోలీసులు ఘటన జరిగిన బోడికోండ పైకి ఎవరినీ అనుమతించడం లేదు.

author avatar
sridhar

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju