Corona: దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 8,987 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,76,987 కు మరోవైపు కరోనా వైద్యం పేరుతో దోపిడి జరుగుతోందని సాక్షాత్తు ఏపీ మంత్రి ఫైర్ అయ్యారు.
ఏపీ లో ఏం జరుగుతోందంటే…
గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 35 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,472 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 3,116 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 37,922 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 9,15,626 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 53,889 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మంత్రి ఫైర్…
మరోవైపు ఏపీలోని పరిణామాలపై మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నా కొందరు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు కనీస కనికరం చూపకుండా.. మాయదారి కరోనాను సైతం కల్ప వృక్షంగా భావిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై తీవ్రస్థాయిలో ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా పేరుతో ప్యాకేజీలు పెడుతున్నారు.. ఒక్కో పేషెంట్ వద్ద ఐదారు లక్షలు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందన్న ఆయన.. పేషెంట్ హాస్పిటల్ లో చేరగానే లక్షలు కట్టమని ఒత్తిడి చేస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలని హితవుపలికిన మంత్రి శ్రీరంగనాథరాజు.. కొన్ని ఆస్పత్రులు చేస్తున్న దోపిడీతో అందరికీ చెడ్డపేరు వస్తుందన్నారు.. సంపాదించి డబ్బులు ఏం చేసుకుంటాం… పోయేటప్పుడు వెంట తీసుకెళ్లలేం కదా..? అంటూ మండిపడ్డారు. నిజంగానే కొన్ని ఆస్పత్రుల తీరు ల్ల రోగులు బెంబేలెత్తిపోతున్నారు.