Corona: దేశవ్యాప్తంగా కలకలకం సృష్టిస్తున్న కరోనా వైరస్ కు చికిత్స విషయంలో ఇప్పటికే ప్రజలు బెంబేలెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు చెప్పేవి ఒక ధరలు.. ఆస్పత్రుల్లో వేసే బిల్లులు మరో ధరలు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ సమయంలో కేంద్రం నుంచి ఓ బ్యాడ్ న్యూస్ రానుందని తెలుస్తోంది. కరోనా చికిత్సలో ఉపయోగించే వ్యాక్సిన్లపై జీఎస్టీ తగ్గిస్తారా? అని గత కొద్దికాలంగా ఎదురుచూస్తున్న వారికి మిగిలేది నిరాశేనని అంటున్నారు. మే 28న జరగబోయే జీఎస్టీ మండలి సమావేశంలో వ్యాక్సిన్లపై పన్ను అంశమే ప్రధాన అజెండాగా ఉందని తెలుస్తోంది.
Read More: KCR: షాక్ః కేసీఆర్ చేసిన ప్రకటనే లైట్ తీసుకుంటున్న అధికారులు
కరోనా విషయంలో బ్యాడ్ న్యూస్ మాత్రమేనా?
ప్రస్తుతం కరోనా టీకాలపై జీఎస్టీ వర్తిస్తోంది. దీంతోపాటుగా చికిత్సలో అవసరమైన మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, మెడికల్ గ్రేడ్ పరికరాలపై జీఎస్టీ విధిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్లపై 5శాతం జీఎస్టీ, మందులు మరియు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై 12శాతం జీఎస్టీ విధిస్తుండటం వివాదాస్పదంగా మారింది. ఈ జీఎస్టీ తగ్గించాలని పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆచీతూచీ స్పందించారు. దేశీయ తయారీదారులు వ్యాక్సిన్ తయారీలో వినియోగించిన ముడిపదార్ధాలు, సేవలకు చెల్లించిన పన్నులను తిరిగి రాబట్టుకోలేక వ్యాక్సిన్ల ధరలు పెంచుతారని అన్నారు. అందుకే జీఎస్టీ మాఫీ చేస్తే వ్యాక్సిన్ ధరలు పెరుగుతాయని విశ్లేషించారు.
Read More: YS Jagan: జగన్ ను అడ్డంగా బుక్ చేస్తున్న కేసీఆర్ ?
మిగిలింద ఇదొక్కటే ఆప్షన్?
జీఎస్టీ నుంచి వ్యాక్సిన్లకు పూర్తిగా మినహాయింపు కల్పించకుండా వ్యాక్సిన్లను జీరో ట్యాక్స్ శ్లాబులో చేర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 0.1శాతం కనీస పన్ను విధిస్తే వ్యాక్సిన్ తయారీదారులు తమ ఇన్పుట్ ట్యాక్స్లను రీఫండ్ చేసుకునే వీలు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. కేంద్రం బహుశా ఇదే నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.