Corona: కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ బ్యాడ్ న్యూస్. రాష్ట్ర ప్రజల కోసం ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఆచరణలో సఫలం అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ వేసుకోవడం ఏకైక మార్గమని ప్రభుత్వం చెప్తున్న సంగతి తెలిసిందే. అయితే, దేశంలో వ్యాక్సిన్ల కొరత కారణంగా ఈ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నాయి. ఇదే ఒరవడిలో తెలంగాణ సైతం ఆహ్వానించింది. అయితే, ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
Read More: KCR: ఏపీలో జగన్ కాకుండా కేసీఆర్ కొత్త మిత్రులు ఎవరో తెలుసా?
దేశంలో ఇదీ పరిస్థితి…
దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 11 రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన సరఫరా కోసం గ్లోబల్ టెండర్లను పిలిచాయి. అయితే, ఆయా రాష్ట్రాలకు షాక్ తగిలేలా ఈ టెండర్ల ప్రతిపాదనలను విదేశీ వ్యాక్సిన్ కంపెనీలు తిరస్కరించాయి. తాము నేరుగా కేంద్ర ప్రభుత్వానికే కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని, రాష్ట్రాలతో తమకు సంబంధం లేదని విదేశీ కంపెనీలు తేల్చిచెప్పేశాయి. వ్యాక్సిన్ల సరఫరా కోసం పంజాబ్ ప్రభుత్వం ఫైజర్, మోడర్నా కంపెనీలను ఆశ్రయించగా ఆ కంపెనీలు నో చెప్పేశాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వ రిక్వెస్ట్ ను కూడా అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీలు మోడర్నా, ఫైజర్ తిరస్కరించాయి. ఇదే ఒరవడిలో రాష్ట్రాలకు విదేశీ కంపెనీల నుంచి నేరుగా వ్యాక్సిన్లు దక్కడం కష్టమని అంచనాలు వెలువడుతున్నాయి.
Read More : KCR: తెలంగాణలో కేసీఆర్ దిమ్మతిరిగి పోయే కుంభకోణం బట్టబయలు?
మరి తెలంగాణ సంగతేంది?
కరోనా వ్యాక్సిన్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం గ్లోబల్ టెండర్ల ను ఆహ్వానించింది. కోటి డోసులకు నోటిఫికేషన్ ను విడుదల చేసి డబ్ల్యూహెచ్వో, డీసీజీఐ పర్మిషన్లు పొందిన వ్యాక్సిన్ సప్లయర్స్ ఇందులో పాల్గొనేందుకు అర్హత కలిగినవని పేర్కొంది. ఈ నెల 21 నుంచి టెండర్ ప్రక్రియ ప్రారంభం కాగా, జూన్ 4 తుది గడువు. అయితే తాజాగా పంజాబ్, ఢిల్లీ ప్రతిపాదనలను ఫైజర్, మోడర్నా కంపెనీలు తిరస్కరించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గ్లోబల్ టెండర్లకు సైతం అదే రూల్ వర్తిస్తుందనే ప్రచారం జరుగుతోంది.