NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంపు

Advertisements
Share

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి పోలీస్ శాఖ భద్రత పెంచింది. సీఎం జగన్, ఎంపి అవినాష్ రెడ్డి, వైసీపీ నేతల నుండి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బుధవారం దస్తగిరి కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కూడా తనకు వైసీపీ వాళ్ల నుండి ముప్పు ఉందని పేర్కొన్నాడు. బుధవారం ఎస్పీని కలిసి తనను అవినాష్ రెడ్డి మనుషులు ఫాలో అవుతున్నారని పేర్కొన్నారు.

Advertisements
dastagiri

 

భాస్కరరెడ్డి అరెస్టు తర్వాత తన కదలికలను వారి అనుచరులు గమనిస్తున్నారని తెలిపారు. దీనిపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి భద్రత పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వన్ ప్లస్ టూ గన్ మెన్ ల భద్రత ఉండగా దాన్ని వన్ ప్లస్ 5 భద్రత పెంపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దస్తగిరి ఇంటి వద్ద 24 గంటలు తుపాకులతో పోలీసులు పహారా కాయనున్నారు. బుధవారం సాయంత్రం నుండి పోలీసులు విధుల్లోకి చేరారు. తాజా భద్రతతో మొత్తం ఆరుగురు పోలీసులు దస్తగిరికి రక్షణ కల్పించనున్నారు.

Advertisements

Share
Advertisements

Related posts

జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ సరికొత్త ఎక్స్పరిమెంట్..!!

sekhar

తను ప్రేమించిన వ్యక్తి పెళ్లి రోజు పిచ్చిగా ఏడ్చిన హీరోయిన్ మీనా!!

Naina

KTR : కేటీఆర్ ను ఇరికిస్తే పోలా… బీజేపీ కొత్త గేమ్‌?

sridhar