Infosys: ఏపిలో భారీ క్యాంపస్ ఏర్పాటునకు దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్పోసిస్ సంసిగ్దత వ్యక్తం చేసింది. తాము వైజాగ్ వస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఇన్ఫోసిస్. ప్రారంభంలో 1000 సీటింగ్ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఇన్ఫోసిస్.. రానున్న కాలంలో మరింతగా విస్తరించి 3000 వేల సీట్లకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకుంది. విశాఖలో క్యాంపస్ ఏర్పాటునకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థ గ్లోబల్ ఇన్ఫాస్ట్రక్చర్ హెడ్ నీలాద్రిప్రసాద్ మిశ్రా, రీజనల్ హెడ్ ఆమెల్ కులకర్ణి రీసెంట్ గా ఏపి పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ తో భేటీ అయి చర్చించారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ కోసం ప్లగ్ అండ్ ప్లే విధానానికి మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సొంత భవనాన్ని సమకూర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని ప్రతినిధులు వెల్లడించారు. ఐటి రాజధానిగా విశాఖ ఎదగడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయనీ, ఇన్ఫోసిస్ రాకతో మరిన్ని దిగ్గజ కంపెనీలు తరలివస్తాయని మంత్రి గుడివాడ అమరనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మధురవాడ సమీపంలో ఇప్పటికే ఆదానీ గ్రూపు రూ.14,500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి వేగంగా పనులు జరుగుతున్నాయి. దీని నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ చిన్న ఐటీ కంపెనీలకే పరిమితమైన విశాఖ లో ఇన్ఫోసిస్ రాకతో ఐటీ హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏపికి చెందిన ఐటీ నిరుద్యోగులు ఇప్పటి వరకూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లి ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు. విశాఖ ఐటీ హబ్ గా అభివృద్ధి చెందితే ఏపికి చెందిన ఐటీ నిరుద్యోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే ఉద్యోగాలు పొందే అవకాశం ఏర్పడుతుంది.
We are coming to city of…
Oranges #InfyNagpur
Roshogollas #InfyKolkata
Beaches #InfyVizag
Poha and Jalebi #InfyIndore
The Textile city #InfyCoimbatore
National Capital Region #InfyNoida
Stay tuned.— Infosys (@Infosys) June 20, 2022