NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS AB Venkateshwara Rao: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరో లేఖాస్త్రం

IPS AB Venkateshwara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) మరో సారి సీఎం సమీర్ శర్మకు లేఖ రాశారు. ఇంతకు ముందు కూడా ఏబీవీ తన సస్పెన్షన్ ఎత్తివేత, పోస్టింగ్ తదితర అంశాలపై మూడు లేఖలు రాశారు. తాజాగా మరో సారి సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తన సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ ఇప్పటి వరకూ పోస్టింగ్ ఇవ్వకపోవడంపై ఆయన లేఖలో ప్రస్తావించారు. తక్షణమే తనకు పోస్టింగ్ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న తన జీతభత్యాలను కూడా విడుదల చేయాలని ఏబీవీ కోరారు.

IPS AB Venkateshwara Rao Letter To AP CS sameer sharma
IPS AB Venkateshwara Rao Letter To AP CS sameer sharma

IPS AB Venkateshwara Rao: కోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ ఎత్తివేసినా..

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తొలుత తన సస్పెన్షన్ పై ఆయన క్వాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ చర్యను సమర్ధించింది. ఆ తరువాత ఏబీవీ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆరు నెలల చొప్పున ఆయన సస్పెన్షన్ ను కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏబీవీ మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండేళ్లకు పైబడి ఐపీఎస్ అధికారులను సస్పెన్షన్ లో పెట్టరాదన్న నిబంధనను పురస్కరించుకుని ఏబీవీ సస్పెన్షన్ తక్షణమే రద్దు చేసి, ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఇటీవలే కోర్టు తీర్పు ఇచ్చింది.

2020 ఫిబ్రవరి 8 నుండి సస్పెన్షన్ ఎత్తివేయాలి

సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఏబీ వెంకటేశ్వర రావు పలు మార్లు అమరావతి సచివాలయానికి వెళ్లి సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ప్రయత్నించారు. సీఎస్ కలిసేందుకు తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఇదివరకే ఏబీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మూడు లేఖలు రాశారు. ఆ తరువాత ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జీఏడీలో ఏబీవీ రిపోర్టింగ్ చేశారు. పోస్టింగ్ అంశంతో పాటు ఉత్తర్వుల్లో తప్పులపై ఏబీవీ గురువారం మరో లేఖ రాశారు. 2020 ఫిబ్రవరి 8వ తేదీ నుండి సస్పెన్షన్ ఎత్తివేత వర్తింపజేయాలని న్యాయస్థానం ఆదేశించినా అది అమలు అమలు చేయలేదనీ, 2022 ఫిబ్రవరి 8 నుండి వర్తింపజేస్తూ తప్పుడు జీవో ఇచ్చారని ఏబీవీ పేర్కొన్నారు. ఇప్పటికైనా చట్ట ప్రకారం, పరిపాలన నియమావళి, పద్ధతుల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఏబీవీ కోరారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?