IPS ABV: సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) మరో సారి హైకోర్టు (AP High Court) ను ఆశ్రయించారు. ఇంటెలిజెన్స్ డీజీగా పని చేసిన సమయంలో భద్రతా పరిరకాల కొనుగోలు వ్యవహారంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏబీవీ. పరికరాల కొనుగోలు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసింది లేదు. ఒక్క పైసా ఎవరికీ చెల్లించింది లేదు, విజిలెన్స్ కమిషన్ ఆమోదం ఆమోదం పొందకుండానే సాధారణ విచారణ జరిపి 2021 మార్చి నెలలో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తప్పుడు ఆరోపణలతో తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని ఏసీబీ పిటిషన్ లో కోరారు. ఈ వ్యాజ్యంలో తుది నిర్ణయం వెల్లడించే వరకూ ఎఫ్ఐఆర్ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలను నిలువరించేందుకు మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. భద్రత పరికరాల కొనుగోలు నిర్ణయంలో తన పాత్ర లేదని పేర్కొంటూనే తన వల్ల ఎలాంటి ఆర్దిక నష్టం జరగలేదన్నారు. అక్రమాలు జరగనప్పుడు, ఆర్ధిక నష్టం వాటిల్లనప్పుడూ ఏసీబీ చట్టం కింద కేసు చెల్లుబాటు కాదని ఆయన తెలిపారు. మోసం చేసినట్లుగా గానీ, తన వల్ల ఒక్కరయినా మోసానికి గురైనట్లు ఆరోపణలు లేనందు వల్ల ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చెల్లదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా పోలీసులు తనపై కక్ష సాధింపు కొసం వత్తిళ్లకు తలొగ్గి కేసు నమోదు చేశారని ఏబీవీ పేర్కొన్నారు.