IPS officers: రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ మేరకు బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ప్రక్రియలో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి.
బదిలీ అయిన అధికారుల వివరాలు ఇవే
విజయనగరం ఎస్పీ బి రాజకుమారి మంగళగిరి దిశ డీఐజీ (పదోన్నతి) నియమితులైయ్యారు. దిశ ఎస్పీ ఎం దీపిక విజయనగరం ఎస్పీగా, విజయవాడ రైల్వే ఎస్పీ సిహెచ్ విజయరావు నెల్లూరు ఎస్పీగా, కృష్ణా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయూం అస్మీ గ్రేహౌండ్స్ గ్రూపు, ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ కృష్ణా జిల్లా ఎస్పీగా, చిత్తూరు ఎస్ఈబీ ఏఎస్పీ వై రిషాంత్ రెడ్డి గుంటూరు రూరల్ అడ్మిన్ ఏఎస్పీగా, నర్సీపట్నం ఓఎస్డీ ఎస్ సతీష్ కుమార్ ఎస్ఈబీ ఏఎస్పీగా, చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఏస్ఈబీ ఏఎస్పీగా, రంపచోడవరం ఏఎస్పీ జి బిందు మాధవ్ ఏస్ఈబీ ఏఎస్పీగా, ఏఎస్పీ తుహిన్ సిన్హా ఎస్ఈబీ ఏఎస్పీగా, గ్రేహాండ్స్ అసాల్ట్ కమాండర్ లుగా ఉన్న పి జగదీష్ పాడేరు ఏఎస్పీగా, జి కృష్ణ కాంత్ చింతూరు ఏఎస్పీగా, విఎన్ మణికంఠ చందోలు నర్సీపట్నం ఏఎస్పీగా, కృష్ణకాంత్ పటేల్ రంపచోడవరం ఏఎస్పీగా, తుషార్ దూడి చింతపల్లి ఏఎస్పీగా బదిలీ అయ్యారు.