Chandrababu : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇలాకా అయిన కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటిన్నర సంవత్సరంలో జమిలి ఎన్నికలు రావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరని కూడా చంద్రబాబు ప్రకటించేయడం గమనార్హం.
Chandrababu మూడు రోజులు… కీలక వ్యాఖ్యలు..
గురువారం నుంచి 3 రోజల కుప్పం పర్యటన పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ అరాచకాలు సాగించిందని మండిపడ్డారు. అయినా కుప్పం ప్రజలు తనను గుండెల్లో దాచుకున్నారని.. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని బాబు తెలిపారు. తప హయాంలో పులివెందులకు తాను నీళ్లిస్తే.. కుప్పంకు నీళ్లివ్వకుండా జగన్ అడ్డుకున్నారని విమర్శించారు. కుప్పం ప్రజలపై జగన్ ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. తనకు రౌడీయిజం చేసే అవాలవాటు లేదని.. అదే కనుక ఉంటే మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో ఉండేవారే కాదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కుప్పం ప్రజలను కాపాడుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు.
భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పేసిన బాబు
ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలు , అందులో గెలుపు ఓటముల గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్దికాలంగా చర్చల్లో ఉన్న జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, ఒకటిన్నర సంవత్సరంలో జమిలి ఎన్నికలు రావడం ఖాయమని టీడీపీ అధినేత జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో తమదే విజయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈ కామెంట్లు పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు చెప్పారా లేదంటే బాబుకు పక్కా సమాచారం ఏదైనా ఉందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.