ఇంటిపట్టాల పంపిణిలో కొత్త విషయం ఇది… ఎంతో విలువైన స్థలాలు పేదలకు ఇస్తున్నమని దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వలేని భారీ ఎత్తున పట్టాలు ఇస్తున్నామని చెప్పిన జగన్ ప్రభుత్వం పేదలను మోసం చేస్తుందా..? లేక తిమ్మిని బమ్మి చేస్తుందా? మరి ఇంకేదైనా ఉందా..? రహస్య అజెండా అమలులో భాగమా? అబ్బో ఇంటి పట్టాల తంతులో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు ఇప్పుడు ప్రభుత్వ నిజాయతీని ప్రశ్నిస్తున్నాయి… జగన్ చేస్తున్న వింత విషయాన్నీ బయటకు తీస్తున్నాయి…. అదేమిటంటే…
** జగన్ ఇంటి పట్టాల కార్యక్రమంలో జగన్ ఇచ్చిన ఆయన చిత్రంతో ఉన్న పట్టాను ఒకసారి గమనించండి… అది పక్క డి ఫామ్ పట్టా. అంటే తాత్కాలిక పట్టా. అంటే ఆ స్థలం మీద పేదలకు ఎలాంటి హక్కు ఉండదు… అన్న మాట. దీనికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే దానిపై హక్కు వస్తుంది… అరే మరి ఇదేంటి ఎలాంటి పట్టాలు ఇచ్చారు అని అడిగితే మాత్రం జగన్ ప్రభుత్వ పెద్దలు, అధికలురు ముక్త కంఠంతో చెప్పేది ఒక్కటే….. కోర్టు కేసులున్నాయి… అని…
** రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సేకరించిన అన్ని స్థలల మీద కోర్టు కేసులు లేవు అన్నది గుర్తించాలి. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 10 శాతం స్థలాలపై కేసులు… వివిధ లీగల్ అడ్డంకులు, స్టే లు ఉన్న మాట వాస్తవమే… వాటిని ఎవరు వేయించారు.. కోర్టుల వరకు ఎవరు వెళ్లారు.. ఎందుకు ఏమా కథ అనే దానిలోకి వెళ్తే పెద్ద విషయం. దానిలోకి వెళ్లకుండా చూస్తే … ప్రభుత్వం చెప్పినట్లే 10 శాతం స్థలాల కు సంబంధించి మాత్రమే.. వివాదం ఉన్న చోట మాత్రమే డి ఫామ్ పట్టా ఇవ్వాలి. మిగిలిన చోట సీఎం చెప్పినట్టు రిజిస్టేషన్ పట్టా ఇవ్వాలి. ఇది సహేతుకం… కానీ జరుగుతున్నది వేరు కదా…
** ఇళ్ళ స్థలాల కోసం పట్టాలు పంపిణీని ప్రతిపక్ష పార్టీలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు అని చెబుతూ ప్రభత్వం వచ్చింది.. పలు థఫాలుగా వాయిదాలు వేసింది. కోర్టులలో కేసులు కావాలని వేశారు అని చెప్పారు. అయితే చివరకు కేవలం 10 శాతం భూముల మీదనే కేసులు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది.. దానిలో కూడా వాస్తవంగా చూస్తే కేవలం 4% భూములు పైన మాత్రమే కేసులున్నట్లు తెలుస్తోంది.
** క్రిస్మస్ రోజున ముహూర్తం పెట్టి వరుసగా 15 రోజులు పాటు 30,75,000 పట్టాల పంపకం అంటూ చెప్పి మొదటిగా 20,00,000 ఇళ్ళ పట్టాలు, తరువాత వాటిని క్రమేణా 25,00,000 చేసి, చివరకు 30,00,000 అంటూ ఇప్పుడు 30,75,000 చేసారు. అయితే అన్ని చోట్ల అధికారులు చెప్పే మాట
ఈ విషయం కోర్టు పరిథిలో ఉన్నందున డి.ఫారం పట్టా మాత్రమే ఇస్తామని, రిజస్ట్రేషన్ కోర్టు తీర్పు తరువాత ఇస్తామని చెబుతున్నారు.
** ఇవి ఉత్తుత్తి పట్టాలే అని తెలుస్తోంది. వీటిని తరువాత వచ్చే ప్రభుత్వం అంగీకరించక పోతే, నష్టపోయేది ఎవరు ..? అప్పుడు వచ్చే ప్రభుత్వాలు వీటిని అనుమతించేది లేదని చెబితే ప్రజల్లో వచ్చే వ్యతిరేకలతకు ఎవరు బాధ్యత వహిస్తారు అన్నది ప్రశ్న.
** ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన విషయం ఏమిటంటే, కేవలం 10% భూములు మాత్రమే కోర్టులో వివాదం ఉన్నదని. అంటే షుమారుగా 3,07,500 పట్టాలు వివాదంలో ఉన్నాయి. వాటి వరకు డి.ఫారం ఇచ్చి, మిగిలిన మొత్తం ఇళ్ళకు సరైన పట్టాలతో రిజిస్ట్రేషన్ చేయవచ్చు కదా? ఏవరు అడ్డం పడుతున్నారు? ఏందుకు ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పటం లేదు?
దీనిలో తర్వాత ఏమైనా తేడాలు వచ్చిన… వచ్చే ప్రభుత్వాలు కొర్రీలు పెట్టిన నష్టపోయేది పేదోడు….
రాజకీయాలలోకి ప్రభుత్వ పట్టాల పంపిణి తీసుకువెళ్తే… తర్వాత వచ్చే చిక్కులు , నష్టాలను ఎవరు భరించాలి.. ? ఎందుకు ఈ ముసుగులో పట్టాల పంపిణి ఆట అన్నది ప్రభుత్వమే చెప్పాలి… రిజిస్ట్రేషన్ కు రాష్ట్రవ్యాప్తంగా అడ్డంకులు ఏవి లేవని ఏమైనా లీగల్ ఇబ్బందులు వస్తే దానికి సమాధానం చెప్పేది ఎవరు???